తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర తొలి వారం వైభవంగా నిర్వహించారు. జాతర ముందు మూడు వారాలు, జాతర వారం, జాతర తరువాత ఐదు వారాలు మారు పొంగళ్ళు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం చిత్ర నెల ప్రారంభం సందర్భంగా తొలి వారం అమ్మవారికి స్వర్ణముఖ కవచం, వజ్ర కిరీటం, పండ్లు, పూలతో వైభవంగా అలంకరణలు చేసారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.