కాపు ఆత్మీయ సమ్మేళనానికి విశేష స్పందన

76చూసినవారు
మండపేట సూర్య కన్వెన్షన్ లో గురువారం జరిగిన నియోజకవర్గ కాపు ఆత్మీయ సమ్మేళనానికి విశేష స్పందన వచ్చింది. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, వేగుళ్ళ లీలాకృష్ణ, బండారు శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ కూటమి విజయమే రాష్ట్ర భవిష్యత్తన్నారు. కాపులంతా సంఘటితమై టిడిపి అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు వేగుళ్ళ జోగేశ్వరరావు, గంటి హరీష్ మాధూర్ లకు అఖండ మెజారిటీ చేకూర్చాలని కోరారు.

సంబంధిత పోస్ట్