భీమేశ్వరునికి విశేష పూజలు

51చూసినవారు
క్రోది నామ సంవత్సరం ఉగాది మహా పర్వదినం సందర్భంగా సామర్లకోట కుమార రామ భీమేశ్వరాలయంలో మంగళవారం విశేష పూజలు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బళ్ల నీలకంఠం ఆధ్వర్యంలో పండితులు సోమేస్వర శర్మ, చెరుకూరి రాంబాబు తదితరులచే స్వామివారికి అభిషేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఉగాది పచ్చడి ప్రసాదాన్ని అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్