సామర్లకోటలో మహిళలు టీడీపీలోకి చేరిక

69చూసినవారు
సామర్లకోట పట్టణ పరిధి చిన్నివీధికి చెందిన పలువురు మహిళలు మంగళవారం తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్, తదితర పట్టణ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి అభినందించారు. సానిపోయిని సంధ్యా రాణీ, పచ్చిగోళ్ల మంగతాయారు, చుండ్రు రామలక్ష్మీ తదితర 20 కుటుంబాలకు చెందిన వారు టీడీపీలోకి చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్