ప్రజల నుంచి వచ్చే అర్జీలు, వాటి పరిష్కార విషయంలో సమన్వయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జేసీ చిన్న రాముడు, డీఆర్ఓ సీతారామ్మూర్తిలతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలు రీఓపెన్ కాకుండా క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించి అధికారులు పరిష్కరించాలన్నారు.