గాంధీ ఆశయాలలో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత

61చూసినవారు
మహాత్మా గాంధీ ఆశయాలలో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వాలు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. బుధవారం రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛత హీ సేవ ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్