ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి తీర్థ మహోత్సవ ఏర్పాట్ల కోసం అన్నవరం దేవస్థానం వారి ఆధ్వర్యంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సమీక్ష సమావేశం నిర్వహించారు. గురువారం జరిగిన ఈ సమావేశంలో మార్చ్ 19 వ తేదీనుండి ఐదు రోజులపాటు సాగే ఈ తీర్థ మహోత్సవ కార్యక్రమానికి అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమం లో ఆయన తో పాటు రాజమండ్రి ఆర్డీవో చైత్రవర్షిని మొదలైనవారు పాల్గొన్నారు.