వైసిపి అవినీతి కోటలు బద్దలు కొడదామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం రామచంద్రపురం మండలం ద్రాక్షారామ బోస్ బొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. కార్మిక వర్గానికి, మహిళలకు అండగా ఉంటామన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించి అధికారంలోకి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక్కడ మాట్లాడేందుకు కేవలం 10 నిమిషాలే సమయం ఉందని అందువల్ల మాట్లాడ లేకపోతున్నానని అన్నారు.