అంతర్వేది నరసింహుడి ఆలయానికి రూ. 37. 16 లక్షల ఆదాయం

57చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి హుండీ ఆదాయం రూ. 37, 16, 312 వచ్చిందని ఆలయ ఏసీ సత్యనారాయణ తెలిపారు. 106 రోజులకు సంబంధించి భక్తులు హుండీల్లో సమర్పించుకున్న కానుకలను సిబ్బంది శనివారం తెరిచి లెక్కించారు. ప్రధాన హుండీ ద్వారా రూ. 36, 37, 308, అన్నదాన హుండీ రూ. 56, 625, అనుబంధ ఆలయం గుర్రాలక్క అమ్మవారి హుండీలో రూ. 22, 379 మొత్తం రూ. 37, 16, 312 ఆదాయం సమకూరిందని చెప్పారు.

సంబంధిత పోస్ట్