మలికిపురం: మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని నిరసన

55చూసినవారు
మలికిపురం: మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని నిరసన
ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని మేనిఫెస్టోలో పెట్టి, అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచిన ఇప్పటివరకు ఆ హామీని అమలు చేయలేదని పిసిసి సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు అన్నారు. మంగళవారం మలికిపురంలో ఆయన రాజోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బస్సులో ప్రయాణం చేసి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్