గృహిణులకు అగ్నిమాపక అధికారుల సూచన

70చూసినవారు
అగ్నిప్రమాదాల సమయంలో మంటలను అదుపుచేసి ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యమని రాజోలు ఫైర్ ఆఫీసర్ బాలకృష్ణ తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమం రాజోలులోని అగ్నిమాపక కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్యాస్ వాడకంలో గృహిణులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు వైర్లను, స్విచ్ బోర్డులను పరిశీలించాలన్నారు.

సంబంధిత పోస్ట్