ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా ఎస్పీ
కాకినాడ జిల్లా పోలీసు శాఖలోని అధికారులు, సిబ్బంది బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఓటు హక్కునువినియోగించుకుంటున్నారు. జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తన ఓటు హక్కును కాకినాడ కార్పొరేషన్ లో మంగళవారం వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.