కృష్ణాజిల్లా ఘంటసాల మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఓ నాగమల్లేశ్వరి సోమవారం ఆందోళన చేపట్టారు. తనను విఆర్వోలు ఇబ్బందులు గురిచేస్తున్నారని, తన కుమారుడు పై లేనిపోని ఆరోపణలు చేసి కేసు పెట్టారని ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే కలెక్టర్ వచ్చి నా సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో పెట్రోల్ నేల మీద పోసి ఆందోళన నిర్వహించడం జరిగింది.