ఏలూరు రూరల్ మండలం తిమ్మారావుగూడెంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి సోమవారం ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. ‘తమ కుటుంబం తరఫున 190 ఎకరాలు ఈ గ్రామానికి ఇచ్చాం. ఎవరైనా ఇవ్వగలరా. ఇక్కడ చాలా డ్రామాలు జరుగుతున్నాయి. అన్నీ చూస్తున్నా. కొఠారు ప్రశాంతంగా ఉన్నాడని అనుకుంటున్నారు. నేను ఎంత సాఫ్ట్గా ఉంటానో, అంతే హార్డ్గా ఉండగలను. నన్ను ఎదుర్కోవాలంటే చింతమనేని మళ్లీ పుట్టాలి’ అని అన్నారు.