ముసునూరులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

558చూసినవారు
ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. బొలెరో వాహనంలో తరలిస్తుండగా సివిల్ సప్లై డిపి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు దాడి చేశారు. మూడు టన్నుల 50 కేజీల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లుగా ఆయన తెలిపారు. రమణక్కపేటకు చెందిన వంశీకృష్ణ అనే వ్యక్తి అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా అధికారులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్