వరద బాధితులకు సింగపూర్‌ ప్రవాస తెలుగు ఆంధ్రులు విరాళం

74చూసినవారు
వరద బాధితులకు సింగపూర్‌ ప్రవాస తెలుగు ఆంధ్రులు విరాళం
సింగపూర్‌లో నివసిస్తున్న ప్రవాస తెలుగు ఆంధ్రులు వరద బాధితులకు అండగా నిలిచేందుకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 17. 50 లక్షల చెక్కును సోమవారం అందజేశారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సమక్షంలో బొబ్బ రాజాచౌదరి, సతీష్, రాధిక ప్రసాద్ ఈ మేరకు చెక్కును విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి అందజేశారు. గతంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడిగా పనిచేశారు.

సంబంధిత పోస్ట్