నాట్లు వేయని రైతులు కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలని ప. గో జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేశ్వరరావు సూచించారు. శనివారం ఉండి మండలంలోని పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. నారుమడులు దెబ్బతింటే తక్కువ కాల పరిమితి గల రకాలను ఎంచుకొని మళ్లీ నారుమడులు వేసుకోవాలని సూచించారు.