సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికపై AP CM చంద్రబాబు స్పందిస్తూ.. 'AP రైజింగ్' అంటూ ట్వీట్ చేశారు. నివేదిక ప్రకారం 2024~25 ఏడాది వృద్ధిరేటులో ఏపీ దేశంలో రెండో స్థానానికి చేరింది. తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. కూటమి ప్రభుత్వ చర్యలతో వృద్ధిరేటును సాధించామని, ఇది రాష్ట్ర ప్రజల సమష్టి విజయం అంటూ సీఎం అభినందనలు తెలిపారు.