గంజాయి రహిత సమాజానికి కృషి చేయండి: ఎస్పీ సతీశ్ కుమార్

83చూసినవారు
గంజాయి రహిత సమాజానికి కృషి చేయండి: ఎస్పీ సతీశ్ కుమార్
గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ ను బుధవారం ఎస్పీ సతీశ్ కుమార్ ఆకస్మికంగా తనికి చేశారు. పెండింగ్ కేసుల వివరాలను తెలుసుకుని, స్టేషన్ ఆవరణ పరిశీలించారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అసాంఘిక శక్తులపై చర్యలు తీసుకోవాలని, గంజాయి రహిత సమాజానికి కృషి చేయాలని ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ జయరాం ప్రసాద్, సీఐ శ్రీనివాసరావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్