ఈ రోజు పర్చూరు నియోజకవర్గం కొత్తగొల్లపాలెంలో "పేదల సేవలో" కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ కోసం మాట్లాడారు. "ఏపీలో 4000, తెలంగాణలో 2016, తమిళనాడులో 1000, కేరళలో 1600, కర్ణాటకలో 600, ఒడిషా & ఉత్తరప్రదేశ్లో 500 ఇస్తున్నాయి" అని సీఎం పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే అత్యధిక పెన్షన్ ఇస్తున్నాం అని చంద్రబాబు తెలిపారు.