కడప జిల్లా ఖాజీపేట మండలం బోసిరెడ్డి పల్లెకు చెందిన జయరాం రాజు (55) మరియు ఆయన భార్య రాజేశ్వరి (48) బుధవారం గ్యాస్ సిలిండర్ పేలడంతో గాయాలపాలయ్యారు. వంట చేయడానికి సిలిండర్ వెలిగిస్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా గాయపడిన వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సిలిండర్ పేలడం వల్ల ఊహించని విధంగా ఇద్దరికీ తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.