ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 12వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారని ఆలయ అధికారులు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆలయంలో ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. ఏప్రిల్ 12న తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలుపుతారన్నారు.