భక్తిశ్రద్ధలతో లక్ష కుంకుమార్చన పూజలు
సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామపంచాయతీ బంగారుపేటలో వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారి 32 వ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఆలయ నిర్వాహకులు అమ్మవారికి గణపతి పూజ, స్వస్తివాచనము- మాతృకాపూజ ఆచార్యాదిఋత్విక్ వరణము, రక్షాబంధనము, పంచగవ్య ప్రాశనము, నవగ్రహ వాస్తు, సర్వతోభద్ర మండల ఆరాధన లు, అష్టోత్తర శత కలశాభిషేకం, అర్చన, మంగళహారతి, మంత్ర పుష్పం పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.