వైఎస్సార్ సీపీలో శెట్టిబలిజ సామాజిక వర్గానికి అన్ని రంగాల్లోనూ సముచిత స్థానం కల్పించామని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్కుమార్ పేర్కొన్నారు. ముమ్మిడివరం ఎయిమ్స్ కాలేజి లేఅవుట్లో ఆ పార్టీ నాయకుడు పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో అదివారం జరిగిన శెట్టిబలిజల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇద్దరు శెట్టిబలిజ నేతలకు రాజ్యసభ సీటు, కొందరికి ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ల పదవులు ఇచ్చిందన్నారు.