గత ఐదేళ్లలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కోరారు. ఆదివారం ముమ్మిడివరం పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లాలోని ఏడు నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ సభ్యుల ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే పొన్నాడ, పితాని బాలకృష్ణలు ముఖ్య అతిధులుగా పాల్గొని వారికి దిశానిర్దేశం చేశారు.