హుస్సేన్ పురంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

70చూసినవారు
సామర్లకోట మండలం హుస్సేన్ పురంలో విజయదశమి నవరాత్రుల సందర్భంగా గురువారం అమ్మవారిని వేదమంత్రోచ్చరణల మధ్య ఘనంగా ప్రతిష్టించి ఉత్సవాలు ప్రారంభించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను భక్తులకు, గ్రామ పెద్దలకు అందించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ఆకాంక్షించారు. తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్