ఏలేరుకు తగ్గిన వరద ఉద్ధృతి

71చూసినవారు
ఏలేరుకు తగ్గిన వరద ఉద్ధృతి
గత నాలుగు రోజుల నుంచి ఉద్ధృతంగా ప్రవహించిన ఏలేరు నది వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు ఏలేరు ప్రాజెక్టులోకి చేరడంతో 40 వేల క్యూసెక్కులకు పైగా వరద నీటిని కిందకు విడుదల చేశారు. దీంతో కిర్లంపూడి, పిఠాపురం, పెద్దాపురం మండలాల్లో పలు గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. వరద తగ్గుముఖం పట్టడంతో లోతట్టు ప్రాంత బాధితులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్