గొల్లప్రోలులో పడవపై అంతిమ యాత్ర

56చూసినవారు
గొల్లప్రోలులో పడవపై అంతిమ యాత్ర
కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణ శివారు సూరంపేటలో ఈసరపు సూరిబాబు(62) అనే వ్యక్తి బుధవారం అకాల మరణంతో పొందారు. ఈ ప్రదేశమంతా గత నాలుగు రోజులుగా వరద ముంచెత్తింది. చుట్టూ వరద నీరు ఉండడంతో బయటికి వెళ్లే దారిలేక ఖననం చేయడానికి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వెంటనే బోటును పంపించడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్