కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగళవారం టిడిపి పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. గన్నవరంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రులలో శాసనసభ్యులు కొల్లు రవీంద్ర కూడా ఉన్నారని అధికారిక వర్గాల ద్వారా సమాచారం అందింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని టిడిపి నాయకులు కార్యకర్తలు ఒకరికి ఒకరు సీట్లు తినిపించుకుని శుభాకాంక్షలు తెలిపారు.