ఆదుకోవాలని తొమ్మిదవ తరగతి విద్యార్థి వేడుకోలు

68చూసినవారు
అవనిగడ్డ మండలం పులిగడ్డ పంచాయతీ రేగులంక గ్రామంలో వరదల కారణంగా పుస్తకాలు తడిచిపోయాయని తొమ్మిదో తరగతి విద్యార్థి శనివారం ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవలే తన తండ్రి చనిపోయాడని, తల్లి అనారోగ్యంతో మంచాన పడిందని తెలిపింది. పుస్తకాలు, దుస్తులు వరద నీటికి తడిసిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థి పవిత్ర తెలిపింది. తనకు సాయం అందించాలని విద్యార్థి వేడుకుంటుంది.

సంబంధిత పోస్ట్