వరద బాధితులకు ఆశ్రమం కల్పిస్తాం

80చూసినవారు
వరద ముంపుకు గురైన పుట్టగుంట, చేదుర్తిపాడు, కండ్రిక ప్రాంతాల వారికి గుడివాడ బైపాస్ రోడ్డులోని గ్రేస్ గార్డెన్స్ ఆవరణలో ఆశ్రమం ఏర్పాటు చేశామని గ్రేస్ గార్డెన్స్ అధినేత వన బాస్ బుధవారం అన్నారు. మరికొన్ని గ్రామాలు వరద ముంపునకు గురయ్యే ప్రమాదం ఉన్నందున ఎంత మంది వచ్చినా వారికి ఆశ్రమం కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని వారికి వసతి, భోజనం సొంత ఖర్చులతో తాము ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్