మండవల్లిలో దోమల మందు చల్లడం లేదు

84చూసినవారు
మండవల్లిలో దోమల మందు చల్లడం లేదు
స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి మండలంలో ని అన్ని గ్రామాల్లో బుధవారం గ్రామ సభలను నిర్వహించారు. మండవ ల్లిలో నిర్వహించిన సభలో దోమల మందును ఎందుకు చల్లించలేదని ప్రజలు అధికారుల ను ప్రశ్నించారు. దోమల ఉదృతి ఎక్కువగా ఉండటంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వాపోయారు. దీనిపై జౌషధ పర్య వేక్షకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ రెండేళ్లుగా దోమల మందు సరఫరా లేదని వివరణ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్