మేమిద్దరం ప్రజలకు అందుబాటులో ఉంటామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం రాత్రి మైలవరం నియోజకవర్గ గొల్లపూడి టిడిపి పార్టీ కార్యాలయంలో మైలవరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రితో భేటీ అయ్యారు. మేము ఒకప్పుడు ప్రత్యర్థులమని, ఇప్పుడు మేమిద్దరం కలిసి టిడిపి పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని కార్యకర్తల సమక్షంలో మాజీ మంత్రి అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.