ముస్లి౦లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది వైసిపి పార్టీనే
ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నందిగామ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ నందిగామలో మేము అధికారంలోకి వచ్చాక ఎంతమంది ముస్లింలకు ఉన్నత పదవులు, ఉన్నత అవకాశాలు ఇచ్చామో ముస్లిం సమాజం ఆలోచించాలి అని పేర్కొన్నారు.