రాబోయే సార్వత్రిక ఎన్నికలకు అందరూ సహకరించాలి

557చూసినవారు
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు అందరూ సహకరించాలి
ఆగిరిపల్లి స్థానిక మండల రెవెన్యూ ఆఫీసర్ గా రావులపాలెం నుండి బండి మృత్యుంజయరావు బాధ్యతలు సోమవారం స్వీకరించారు. అన్ని గ్రామాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలందరూ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సహకరించాలని, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని కోరారు. 25 పంచాయతీ గ్రామాలు, 23 రెవెన్యూ, 19 సచివాలయాలు, 59 పిఎస్ లు ప్రజలందరి సహకారంతో, ఎన్నికలు విధులను సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్