నూజివీడు నియోజకవర్గంలో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలోని భూ సమస్యలన్నిటిని పరిష్కరిస్తానని మాజీ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థి ముద్రబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం రాత్రి నూజివీడు నియోజకవర్గం నూజివీడు మండలం వెంకటాయపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు 10 ఏళ్ల నుండి ప్రజాసేవ చేస్తున్నానని ఆయన గుర్తు చేశారు.