ఆగిరిపల్లి మండల వైసీపీ అధ్యక్షుడు పలగాని నరసింహారావు తన పదవికి రాజీనామ చేసినట్లు ప్రకటించారు. ఆగిరిపల్లిలో ఆయన సోమవారం మాట్లాడుతూ. ఈ మేరకు పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నానికి రాజీనామ పత్రం అందించినట్లు తెలిపారు. సాధారణ ఎన్నికల్లో మండలం నుంచి 3700 ఓట్లతో కూటమికి మెజారిటీ రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ పదవికి రాజీనామ చేసినట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కు కృతజ్ఞతలు తెలిపారు.