వైసీపీ పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న యువ నాయకుడు ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలో సోమవారం టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. గ్రామానికి చెందిన యువనేత దేవరపల్లి సురేష్ నాయకత్వంలో 30 మంది కుటుంబాలు వైసీపీని వీడి నూజివీడు టిడిపి కూటం అభ్యర్థి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో టిడిపి కండువాలు కప్పుకున్నారు. ఈ మేరకు వారిని టిడిపి పార్టీలోకి ఆహ్వానించారు. టిడిపి నాయకులు వేణు, తదితరులు పాల్గొన్నారు.