గుర్తు తెలియని మృతదేహం లభ్యం

80చూసినవారు
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు శివారు పిల్లివానిలంక పరిధిలోని కృష్ణానది పాయలో గురువారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుందని పోలీసులు తెలిపారు. సుమారు పది రోజులు క్రితం చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం సమీపంలో లుంగి, చెప్పులు ఉన్నట్లు పోలీసులు గమనించారు.అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్