8 గేట్లు ఎత్తి.. 35, 832 క్యూసెక్కుల నీరు విడుదల

65చూసినవారు
సుంకేసుల జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 38, 277 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని డ్యాం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రిజర్వాయర్ నుంచి 8 గేట్లను ఎత్తి దిగువకు 35, 832 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 1. 235 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. కేసీ కెనాల్ కు 2, 445 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్