చికిత్స పొందుతూ మహిళ మృతి

56చూసినవారు
చికిత్స పొందుతూ మహిళ మృతి
ఓర్వకల్లు మండలంలోని గుట్టపాడుకు చెందిన గూడెం అరుణ (25) చికిత్స పొందుతూ మృతి చెందిందని ఎస్సై సునీల్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అరుణ ఇంట్లో స్పృహ లేకుండా పడిపోవడంతో గమనించిన భర్త రమేష్, బంధువులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందిందన్నారు. మృతురాలి తల్లి శ్యామల తన కూతురు అనుమానాస్పద స్థితిలో మరణించిందని ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్