హైడ్రా కూల్చిన బిల్డింగ్ కు నాకు సంబందం లేదు: కాటసాని

70చూసినవారు
హైదరాబాద్ లోని అమీన్‌పూర్‌ వాణినగర్‌ చెరువులో అక్రమ నిర్మాణం అంటూ హైడ్రా వారు కూల్చిన బిల్డింగ్ కు తనకు ఎటువంటి సంబందం లేదని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం కల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. సంబందం లేని సమస్యలో తనను ఇరికించాలని కొందరు చూస్తున్నారన్నారని ఆరోపించారు. హెచ్ఎండీఏ, ఇరిగేషన్ అధికారులు తన భూమి ఎఫ్టీఏ పరిధిలో లేదని అన్నారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చారన్నారు.

సంబంధిత పోస్ట్