ఫ‌లితాల త‌రువాత కూడా 144 సెక్ష‌న్ అమ‌ల్లో

59చూసినవారు
ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత‌ కూడా 144 సెక్ష‌న్ అమల్లో ఉంటుంద‌ని ఆదోని డియ‌స్పీ శివ నారాయ‌ణ స్వామి తెలిపారు. శ‌నివారం ఆదోనిలోని శ్రీ‌మహేశ్వర కళ్యాణం మంటపంలో జ‌రిగిన పార్టీ నాయకులతో శాంతి కమిటీ స‌మావేశంలో డియ‌స్పీ మాట్లాడారు. నలుగురు కంటే ఎక్కువ మంది గుమి కూడరాదని, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు. ఊరేగింపులు చేయ‌రాద‌ని, టపాసులు, బాణసంచా పేల్చకూడద‌న్నారు.

సంబంధిత పోస్ట్