ఈద్గాలో రంజాను ప్రార్థనలకు సర్వం సిద్ధం: ప్రభుత్వ ఖాజీ

581చూసినవారు
ఆళ్లగడ్డలోని ఈద్గాలో రేపు రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు పవిత్ర ప్రార్థనలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మండల ప్రభుత్వ ఖాజీ మహమ్మద్ జాఫర్ సాదిక్ బుధవారం మీడియాతో మాట్లాడారు. నేటి రాత్రి ఆకాశంలో నెలవంక దర్శనం కాగానే రేపు రంజాన్ పండుగ ఉంటుందన్నారు. పట్టణంలోని అన్ని మసీదుల నుంచి ముస్లిం సోదరులు ఊరేగింపుగా పాత మసీదు నుండి ఉదయం 8: 30 గంటలకు జమాత్ గా బయలుదేరడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్