వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం: సతీష్

57చూసినవారు
వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం: సతీష్
వరద విపత్తు నుంచి విజయవాడ వాసులను రక్షించకుండా నిర్లక్ష్యం చేసిన ఏపీ సీఎం చంద్రబాబుకు, మంత్రులకు ప్రజల ఉసురు తప్పక తగులుతుందని వైఎస్సార్సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్ చార్జ్ ఆదిమూలపు సతీష్ అన్నారు. సోమవారం ఆయన కర్నూలులో మాట్లాడారు. ప్రభుత్వానికి ముందస్తు సమాచారం తెలిసినప్పటికీ వరద నుంచి లక్షలాది ప్రజలను అప్రమత్తం చేయడంతో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.

సంబంధిత పోస్ట్