పెద్దకడబూరు మండలంలోని దొడ్డిమేకలలో ఆడుదాం ఆంధ్రా పోటీలలో భాగంగా 15 మంది క్రీడాకారులకు సర్పంచ్ చంద్రశేఖర్ బుధవారం క్రీడా దుస్తులను విరాళంగా అందజేశారు. క్రీడాకారులు క్రీడాస్పూర్తితో రాణించాలని హితవు పలికారు. గ్రామస్థాయిలో ఉన్న క్రీడాకారుల నైపుణ్యతను వెలికి తీయ్యడానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్రా పోటీలను నిర్వహిస్తున్నారన్నారు.
వైసీపీ నేతలు వెంకటేశ్వర్ రెడ్డి, శివరామిరెడ్డి ఉన్నారు.