దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల అడిషనల్ ఎస్పీ జావలి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె మాట్లాడుతూ ఇతర ఊర్లకు వెళ్లేవారు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంట్లో విలువైన వస్తువులు, నగదు ఉంచుకోరాదన్నారు. ఇళ్లకు నాణ్యతతో కూడిన తాళాలు వేయాలని చెప్పారు. తాళం చెవులు అందుబాటులో ఉంచవద్దన్నారు. ఇంటి తలుపుల వద్ద వెలుతురు ఉండేలా చూడాలన్నారు.