విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందిన ఘటన ఎమ్మిగనూరులో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు మేరకు సున్నం బట్టి వీధిలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిపైకి వెళ్లగా విద్యుత్ తీగలు తగలడంతో రోషన్ అనే యువకుడు మృతిచెందాడు. రాత్రి మద్యం తాగి ఇంటిపైకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.