

కొత్తపల్లి: కాశీవిశ్వనాధ స్వామిని దర్శించుకున్న మాజీఎమ్మెల్యే
ఎంతో పురాతన చరిత్ర గల గ్రామం శింగరాజుపల్లె గ్రామం అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం శింగరాజుపల్లె గ్రామంలో హస్తానక్షత్రయుక్త మిథునలగ్న శుభపుష్కరాంశమందు సీతారామచంద్ర స్వామి, కామాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి, పరివార దేవతల నాభి శిల విగ్రహా ప్రతిష్ట మహోత్సవం జరిగింది. నూతన దేవాళయాల ప్రారంభోత్సవంకు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.