
నందికొట్కూరు: జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించిన సీఐ
క్రీడల్లో పాల్గొనడం వల్ల ఆరోగ్యం, స్నేహభావం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవచ్చని నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. జూపాడుబంగ్లా మండలం భాస్కపురం గ్రామంలో నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా, మంగళవారం జిల్లా కబడి పోటీలను ఏబీఓ సంఘం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ సుబ్రహ్మణ్యం హాజరై, కబడి పోటీలను ప్రారంభించారు.